ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

60చూసినవారు
ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం 8వ రోజు కూడా పర్యటించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్దకు వెళ్లారు. పడవలు ఢీ కొనడం వల్ల దెబ్బతిన్న బ్యారేజ్ కు జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు, నిపుణులతో మాట్లాడి కౌంటర్ వెయిట్ ఏర్పాటు గురించి తెలుసుకున్నారు. అనంతరం కుమ్మరిపాలెం జంక్షన్, సితార సర్కిల్, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్టు మీదుగా జక్కంపూడి వెళ్లారు.

సంబంధిత పోస్ట్