ఘంటసాల మండల పరిధిలోని దేవరకోట గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం కోరుతూ మండలి బుద్దప్రసాద్ కుమార్తె అవనిజ, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు తుమ్మల వరలక్ష్మిలు ఇంటింటికి తిరిగి కరపత్రాలను సోమవారం పంపిణీ చేశారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ను, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలను అఖండ మెజార్టీతో గెలిపించాలని అవనిజ కోరారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.