సొంత గ్రామంలో వంశి కి షాక్

4215చూసినవారు
సొంత గ్రామంలో వంశి కి షాక్
సొంత గ్రామంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీకి షాక్ ఇచ్చారు. ఉంగుటూరు గ్రామ సర్పంచ్ కాటూరి వరప్రసాద్ గురువారం సాయంత్రం తన అనుచరగణంతో గన్నవరం కుటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, మాజీ ఎమ్యెల్యే ముద్రబోయిన వేంకటేశ్వరరావు ల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. సర్పంచ్ కి బాలసౌరి టీడీపీ కండువా కప్పారు. యార్లగడ్డ వెంకట్రావు గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తాను అని వరప్రసాద్ ఈసందర్భంగా అన్నారు. వరప్రసాద్ చేరికతో ఉంగుటూరు టీడీపీలో జోష్ పెరిగింది. మాజీ జడ్పిటిసి యలవర్తి రాజు కూడా టీడీపీ గూటికి చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్