బైక్ పేలి మంటల్లో కాలి ఒకరు మృతి

10360చూసినవారు
బైక్ పేలి మంటల్లో కాలి ఒకరు మృతి చెందిన ఘటన జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. మంగళవారం జగ్గయ్యపేట మండలం నవాబుపేట క్రాస్ రోడ్స్ వద్ద అదే గ్రామానికి చెందిన చింతా వెంకయ్య వ్యాపార నిమిత్తం పెట్రోల్ కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బైక్ తో పాటు వెంకయ్య కూడా మంటల్లో చిక్కుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్