ఇంటి నుంచి పారిపోయిన చిన్నారులు సురక్షితం

70చూసినవారు
ఇంటి నుంచి పారిపోయిన చిన్నారులు సురక్షితం
మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లిదండ్రుల మీద అలిగి ఇంటి నుండి ముగ్గురు మైనర్ బాలురు సోమవారం రాత్రి పారిపోయారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించడంతో హుటాహుటిన గాలింపు చర్యలు చేపట్టారు. వారిని మచిలీపట్నంలో ఆర్. పేట పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వారికి నచ్చచెప్పి తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్