మచిలీపట్నంలో రాజశేఖర్ రెడ్డికి నివాళులు

50చూసినవారు
మచిలీపట్నం సోమవారం దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నియోజకవర్గం ఇన్ ఛార్జ్ పేర్ని కిట్టు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. పేద ప్రజల గుండె చప్పుడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు స్వీట్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్