అధికారులపై మండిపడ్డ రైతులు

84చూసినవారు
అధికారులపై మండిపడ్డ రైతులు
మోపిదేవి పంచాయతీ శివారు రావివారిపాలెం పీఏసిఎస్ ఆవరణలో సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారులు తీరుపై రైతులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక అధికారి సుల్తానా సయ్యద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆడిట్ జమ ఖర్చుల వివరాలు ప్రకటించారు. ప్రస్తుతం పీఏసీఎస్ 9 లక్షల నష్టాల్లో ఉన్నట్లు అధికారులు తెలపడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని లక్షల నగదు ఎందుకు అప్పు లయ్యాయని నిలదీశారు.

సంబంధిత పోస్ట్