ఇబ్రహీంపట్నంలో అక్రమ రేషన్ నిల్వ బియ్యం పట్టివేత

63చూసినవారు
ఇబ్రహీంపట్నంలో అక్రమ రేషన్ నిల్వ బియ్యం పట్టివేత
ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. సుమారు 3, 725 కిలోలు ఉండవచ్చని అధికారులు తెలిపారు. అక్రమంగా నిల్వ చేశారని తెలుసుకున్న అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి బియ్యాన్ని పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మూలపాడులోని 49వ షాపుకు తరలించారు. దాడుల్లో డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, ఆర్ఎఐ గోపి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్