మైలవరం: ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

72చూసినవారు
మైలవరం: ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
మైలవరం ఎండిఓ కార్యాలయం నందు ఎంపీపీ ఇస్లావత్ ప్రసన్న రాణి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ.. కుటుంబ వ్యవస్థకు అద్దం లాంటి రామాయణ మహా కావ్యాన్ని రచించిన తొలి సంస్కృత కవి అని అన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని, ఆయన జీవిత ఇతివృత్తం తెలుపుతుందన్నారు. వేటగాడిగా జన్మించిన తనని తాను మహర్షిగా మలుచుకున్న వాల్మీకి మహర్షి జయంతిని జాతీయ ప్రగతి దివస్ గా జరుపుకుంటాం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్