నూజివీడు: పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్

70చూసినవారు
నూజివీడు: పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కృష్ణారావుపాలెంలో నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో కలిసి పేకాట శిబిరాలపై సోమవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుండి 5 బైక్‌లు, రూ. 27,450 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్