ఆగిరిపల్లి లో పోలీసులు కవాతు

55చూసినవారు
ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆగిరిపల్లి ఎస్సై సురేష్ బాబు అన్నారు. గురువారం రాత్రి నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలోని ఆగిరిపల్లి లో కేంద్ర బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. ఏఎస్ఐ నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్