పార్లమెంటు సభ్యుడు బాలశౌరి క్షేత్రస్థాయి పరిశీలన

74చూసినవారు
పార్లమెంటు సభ్యుడు బాలశౌరి క్షేత్రస్థాయి పరిశీలన
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి సోమవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పెడన రూరల్ మండలం కమలాపురం పంచాయతీ ఉప్పలకలవగుంటా గ్రామంలో రక్షిత మంచినీటి పథకంపై క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం అధికారులతో, నాయకులతో సమావేశమై చర్చించారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్