అదృశ్యమైన బాలికని క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులు

67చూసినవారు
అదృశ్యమైన బాలికని క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులు
ఉయ్యూరు పట్టణంలో అదృశ్యమైన బాలిక జాడ తెలుసుకొని పోలీసులు శుక్రవారం రాత్రి క్షేమంగా ఇంటికి చేర్చారు. మైనర్ బాలిక ఫోన్ వాడే విషయంలో తల్లిదండ్రులు మందలించారనే నెపంతో అలిగి ఇంటి నుండి బయటకు వెళ్లిపోయిందని ఉయ్యూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గన్నవరం డిఎస్పి సిహెచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాలుగు బృందాలు రంగంలోకి దిగి విజయవాడలో మైనర్ బాలిక జాడను తెలుసుకుని ఇంటికి చేర్చడం జరిగింది.

సంబంధిత పోస్ట్