నమ్మి ఓట్లు వేస్తే రాజధాని లేకుండా చేశారు

60చూసినవారు
జగన్ చేతిలో మీరు మోసపోవడమే కాకుండా నేను కూడా మోసపోయానని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల వాపోయారు. శుక్రవారం తిరువూరు పట్టణంలో రోడ్ షో కార్యక్రమంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో ఐదేళ్లు చంద్రబాబుకు అధికారమిస్తే అమరావతిలో గ్రాఫిక్స్ సినిమా చూపించారని విమర్శించారు. జగన్ ను నమ్మి ఓటేస్తే మనకు రాజధాని లేకుండా చేశారని ఆమె ఆరోపించారు. ఓటు మీ ఆయుధం జాగ్రత్తగా ఓటు వేయండి అని కోరారు.

సంబంధిత పోస్ట్