రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగిస్తుందన్న సంకేతాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపిలోకి భారీగా వలసల పరంపర కొనసాగుతోంది. రాజమహేంద్రవరానికి చెందిన బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ వీఏఆర్ కే ప్రసాద్ (అమ్మా ప్రసాద్) లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ప్రసాద్ కు యువనేత లోకేష్ పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.