వసంత కృష్ణ ప్రసాద్ విజయమే లక్ష్యంగా కృషి చేస్తాం

84చూసినవారు
మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజయానికి తమ వంతు బాధ్యతగా తుమ్మలపాలెం ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజ ఇంటింటికీ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిలుకూరు గ్రామంలో పోలిశెట్టి తేజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తమ విలువైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో వసంత కృష్ణ ప్రసాద్ ని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్