విజయవాడలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

51చూసినవారు
విజయవాడలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త
విజయవాడలో సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్త తన భార్య గొంతును కోసి హత్య చేశాడు. పోలీసుల వివరాల మేరకు.. మృతురాలు షేక్ నగీన కంసాలి పేటలో నివాసముంటూ సమోసాల తయారీ కర్మాగారంలో కూలి పనులు చేస్తోంది. భర్త బాజీ పెయింట్ వృత్తిని కొనసాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన బాజి తన భార్య నగీనాతో గొడవపడి ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. సీఐ కొండలరావు ఘటనపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్