ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్టీయు ఏపి రాష్ట సహాధ్యక్షులు సి. నాగరాజు, జిల్లా ఉపాధ్యాక్షులు రమేష్ నాయుడు ఎమ్మెల్యేను కోరారు. బుధవారం ఆదోనిలోని కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పార్థసారథిని సన్మానించి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను మంజూరు చేయాలని, ఐఆర్ను వెంటనే ప్రకటించాలని, ఆర్థిక బకాయిలను విడుదల చేయాలని కోరారు.