మేళతాళాలతో ఊరేగిస్తే..రూ. 5 వేల ప్రైజ్ మనీ: సీఐ

53చూసినవారు
కోడుమూరు పట్టణంలో శనివారం గణేశ్ ఉత్సవ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సీఐ తబ్రేజ్ పాల్గొని మాట్లాడారు. కోడుమూరు మండలంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ పోలీసు శాఖతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సాంప్రదాయాన్ని పాటిస్తూ మేళతాళాలతో ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవ ఊరేగింపు నిర్వహించిన వారికి రూ. 5 వేలు ప్రైజ్ మనీ కూడా ఇస్తామని సీఐ తబ్రేజ్ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్