మీసేవా కేంద్రాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి

59చూసినవారు
మీసేవా కేంద్రాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి
సి. బెళగల్ మండలంలోని పలు గ్రామాల్లో మీసేవా కేంద్రాలను నోడల్ అధికారి బాలకృష్ణ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. మండలంలోని ముడుమాల, సి. బెళగల్, పోలకల్ సచివాలయాలను తనిఖీ చేశారు. ఆధార్ నమోదు, ఈకేవైసి తదితర సేవలను సక్రమంగా అందించాలన్నారు. అలాగే ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు అవసరమైన సేవలు అందించుటలో అలసత్వం తగదన్నారు. మీసేవా కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన రుసుం మాత్రమే తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్