రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, మరొకరికి గాయాలు

59చూసినవారు
కోడుమూరు-కర్నూలు రహదారిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణానికి చెందిన కామార్తి శేఖర్ (46) స్కూటీపై గూడూరుకు బయలు దేరాడు. కర్నూలు రహదారిలో కాల దగ్గర ఎదురుగా వస్తున్న బొలొరో వాహనం స్కూటీని ఢీకొట్టింది. దీంతో శేఖర్ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అదే వాహనం మరో బైక్ ను కుడా ఢీకోనంతో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్