ఆదోనిలోని తిమ్మారెడ్డి సర్కిల్ వద్ద ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ రోడ్ షోను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బండారి గిడ్డయ్య మాదిగ, జి రాజు మాదిగ పిలుపునిచ్చారు. శనివారం ఆదోని పట్టణంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలపించాలని ప్రచారం నిర్వహించారు. మాదిగ ఉప కులాల భవిష్యత్తుకై ప్రతి ఒక్కరూ రోడ్ షోలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.