ఓటరు చైతన్యంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం
By W. Abdul 68చూసినవారుఓటరు చైతన్యమే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని టుటౌన్ సిఐ గోపి అన్నారు. మంగళవారం ఆదోని టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందసాదర్గా వద్ద డిఎస్పి శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.