వారిని వెంటనే అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది

61చూసినవారు
వారిని వెంటనే అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని రిపోర్టులో వచ్చిన తర్వాత విచారణ పేరుతో కాలయాపన చేయకుండా కల్తీ చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని భక్తులు కోరుతున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆయన స్పూర్తితో తాను కూడా రేపటి నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి బుధవారం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్