ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి

69చూసినవారు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సోమవారం ఆదోని ఎమ్మెల్యే పార్థసారధికి వినతి పత్రం అందజేశారు. ఐదు సంవత్సరాలుగా మద్యం దుకాణంలో పనిచేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం నూతన టెండర్ విధానంతో రోడ్డున పడతామని వాపోయారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్