ప్రభుత్వ డిగ్రీ కళాశాలను య‌ధావిధిగా కొనసాగించాలి

85చూసినవారు
ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌ను య‌ధావిధిగా ఉన్న చోట‌నే కొన‌సాగించాల‌ని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్య‌ద‌ర్శి ఎస్ షాబీర్ బాష,  జిల్లా ఉపాధ్యక్షులు దస్తగిరి డిమాండ్ చేశారు. బుధ‌వారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదోనిలోని ఎమ్మిగనూరు సర్కిల్ వ‌ద్ద నిర‌స‌న తెలిపారు. సెకండ్ కౌన్సిలింగ్‌లోనైనా ప్రతి విద్యార్థికి సీటు వచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీకాంత్, వీరేష్, తిరుమల పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్