ఇటీవల ప్రారంభించిన బెంగుళూరు టు గుల్బర్గా వందేమాతరం ఎక్స్ప్రెస్ రైలును ఆదోనిలో నిలుపుదల చేయాలని మాజీ డివిజనల్ రైల్వే యుసి కమిటీ సభ్యులు రాచోటి రామయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం రైల్వే మంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. ఆదోని డివిజన్లోని ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాలో అధికంగా ఉన్న వ్యాపారులు, రైతులు, ఐటీ ఉద్యోగుల కోసం ఆపాలని విజ్ఞప్తి చేశారు.