ఆదోని నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే ఇప్పటి వరకు లేరు. గతంలో హెచ్ సత్యనారాయణ, రాచోటి రామయ్య, మీనాక్షి నాయుడు వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 2014, 2019లో విజయం సాధించిన వై సాయి ప్రసాద్ రెడ్డి 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడతారా అని పలువురు చర్చించుకుంటున్నారు.