హొళగుంద: బడుగు బలహీనవర్గాల అభ్యున్నతే
టీడీపీ ధ్యేయమని కోట్ల సుజాతమ్మ అన్నారు. వందవాగిలి గ్రామంలో శుక్రవారం జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ టీడీపీపార్టీ అని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రజ ల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో
టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు.