కొలిమిగుండ్ల మండల కేంద్రంలో కొద్ది రోజులుగా ఏర్పడిన తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కూటమి పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కొలిమిగుండ్లలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈవోపీఆర్డీకి వినతిపత్రం అందజేశారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెద్దయ్య, వెంకటరమణ, ప్రతాప్, రామమూర్తి చంద్ర, అశోక్ తదితరులు ఈవోపీఆర్డీని కలిసి కొలిమిగుండ్లలో తాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలన్నారు.