బేతంచెర్ల మండల పరిధిలోని ముద్దవరంలో నిబంధనలకు విరుద్ధంగా బెల్టుషాపు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ శివ శంకర్ నాయక్ బుధవారం తెలిపారు. గుమ్మ రమేష్ నుంచి తొమ్మిది మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చట్ట వ్యతిరేక పనులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ శివ శంకర్ నాయక్ అన్నారు.