త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరగనున్నదని ప్యాపిలి మండల పరిధిలో జలదుర్గం గ్రామానికి చెందిన మండల కో ఆప్షన్ మెంబర్ రసూల్ అన్నారు. ఈసందర్భంగా బుధవారం ప్రతి గడప గడప తిరిగి మంత్రి చేసిన అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరికి వివరించారు. కావున ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిగెలిపించాలని కోరారు.