నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

69చూసినవారు
కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయానికి భారీ వరద వస్తుండడంతో ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున తుంగభద్ర నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడూరు ఎస్సై హనుమంతయ్య తెలిపారు. సోమవారం ఉన్నతాధికారుల సూచన మేరకు సుంకేసుల రిజర్వాయర్ ను సందర్శించారు. అనంతరం ఎస్సై హనుమంతయ్య సుంకేసుల గ్రామ ప్రజలు నది వద్దకు వెళ్లొద్దని దండోరా వేయించారు. కార్యక్రమంలో కోడుమూరు సీఐ మన్సూరుద్దీన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్