మంత్రాలయంలో ఘననాథుడి నిమజ్జనం సోమవారం ఘనంగా నిర్వహించారు. రాఘవేంద్రపురం, రామచంద్రనగర్, సుజయీంద్రనగర్, పాత ఊరిలో కొలువైన వినాయకులతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో కొలువు తీరిన గణపయ్యలను వివిధ ప్రత్యేక వాహనాల్లో కూర్చోబెట్టి రాఘవేంద్ర కూడలి మీదుగా తుంగభద్ర నది వరకు బై బై బై గణేషా అంటూ ఘనంగా ఊరేగిస్తూ నిమజ్జనం చేశారు. గణేష్ నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.