మంత్రాలయం మండలంలోని కల్లుదేవకుంటు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు బైటింటి సుధాకర్ రెడ్డి , రవి , రామయ్య , శంకరయ్య , రాగన్న , భీమ , యంకన్న , బిసన్న దాదాపు 50 కుటుంబాలు టీడీపీలోకి చేరారు. వీరికి రఘునాథరెడ్డి , రాకేష్ రెడ్డిలు పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. రాఘవేంద్రరెడ్డి గెలుపుకు కృషి చేస్తామన్నారు. టీడీపీ నాయకులు బాయిగడ్డ రాగన్న ,బాయిగడ్డ రవి మహేష్ నాయుడు పాల్గొన్నారు.