నీట్ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపించాలి: ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్

57చూసినవారు
నీట్ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపించాలి: ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్
నీట్ -2024 పరీక్ష ఫలితాలలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ (ఏఐఎస్ఎఫ్-ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని డిఆర్ఓ కార్యక్రమంలో మంగళవారం వినతి పత్రం అందజేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్. షబ్బీర్ భాష,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్