2వ రోజు విజయవాడలో పర్యటించిన ఎమ్మెల్యే

58చూసినవారు
విజయవాడలోని 59వ వార్డు, అజిత్ సింగ్ నగర్ లో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య బుధవారం 2వ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఎం. కే. బైగ్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ను సందర్శించి, పరిశీలించారు. అనంతరం వరద పరిస్థితి గురించి అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 509వ వార్డు కౌన్సిలర్ పర్వీన్ భర్త జాన్ వలి, మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, రమేష్ రెడ్డి, గిరీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్