పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గౌరు చరితా వెంకటరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం పట్ల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని ఎల్. కె. తండా నాయకుడు, నియోజకవర్గ ఐటీడీపీ స్పోక్స్ పర్సన్ బాబునాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గౌరు చరితా వెంకటరెడ్డికి పూలమాలలు, శ్శాలువాలు వేసి అభినందనలు తెలియజేశారు. తన గెలుపుకు కృషి చేసిన ప్రతిఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు