గుండె వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

72చూసినవారు
గుండె వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
టీడీపీ సీనియర్ నాయకుడు ఈవీ రమణ ఆధ్వర్యంలో కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో గుండె వైద్య శిబిరం నిర్వహించారు. అదివారం ఏర్పాటు చేసిన శిబిరాన్ని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సూచించారు. 200 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్