శ్రీశైలం వన్ టౌన్ పరిధిలో గంజాయి కేసులో పరారైన తిరుపతయ్య అనే ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ. ఎన్డీపీఎస్ యాక్టివ్ కేసులో దోర్నాలకు చెందిన తిరుపతయ్యను, నాటుసారా కేసులో ఆత్మకూరు మండలం పెచ్చెరువు గూడేనికి చెందిన గోవిందును అరెస్టు చేసి రిమాండు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.