శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవార్లను ఆదివారం టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. భ్రమరాంబ అమ్మవారి దయతో శబరమ్మ నంద్యాల పార్లమెంటుకు ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచిందని, అందుకు మొక్కు తీర్చుకోడానికి వచ్చానని తెలియజేశారు. అనంతరం ఆయనకు శ్రీశైలం నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ రౌతు అశోక్ కుమార్ శాలువా కప్పి సన్మానించారు.