నిత్యాన్నదాన పథకానికి రూ. 1, 00, 116 విరాళం

76చూసినవారు
నిత్యాన్నదాన పథకానికి రూ. 1, 00, 116 విరాళం
శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి నంద్యాలకు చెందిన గోరంట్ల రాజశేఖర్ రెడ్డి అనే భక్తుడు రూ. 1,00,116 విరాళం అందజేశారు. ఈ మేరకు సంబంధిత విరాళ సొమ్మును మంగళవారం దేవస్థానం డొనేషన్ కౌంటర్ నందు ఆలయ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలకు ఆలయ మర్యాదలతో స్వామి అమ్మవారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్