రిటైర్డ్ ఎంఈఓ జానకిరామ్ సేవలు మరువలేనివి

75చూసినవారు
రిటైర్డ్ ఎంఈఓ జానకిరామ్ సేవలు మరువలేనివి
ఆత్మకూరు రిటైర్డ్ ఎంఈఓ జానకి రామ్ విద్యారంగంలో చేసిన సేవలు మరువలేనివని ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు శంకర్, ఉమర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆత్మకూరు పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయనకు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ 34 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విద్యారంగంలో జానకిరామ్ సేవలందించడం గొప్ప విషయం అని అన్నారు. ప్రత్యేకించి 24 ఏళ్లపాటు గణిత ఉపాధ్యాయునిగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్