ఐఎండీ ప్రకారం ఇవాళ ఉ.8 గంటలకు అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది. ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ.. శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.