గుంటూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. సంజీవయ్య నగర్లోని 2వ లైన్లో స్థిరాస్తి వ్యాపారి కంచర్ల దేవానందం జీవనం సాగిస్తుంటాడు. గుర్తు తెలియని దుండగులు కంచర్ల దేవానందంను బుధవారం దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.