AP: ఓట్ల లెక్కింపుకు రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశామని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. "రేపు మ. 12-1 గంటల మధ్య ఏ పార్టీకి మెజార్టీ అనే దానిపై స్పష్టత వస్తుంది. కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ స్థానాల్లో 5 గంటల్లో ఫలితాలు వెలువడతాయి. అమలాపురం ఎంపీ స్థానంలో లెక్కింపునకు 27 రౌండ్లు పడుతుంది.. ఫలితాలు వచ్చేందుకు 9 గంటలు పట్టొచ్చు." అని మీనా పేర్కొన్నారు.