జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున
మెగాస్టార్ చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే పవన్ కుటుంబీకులు, సినీ నటులు, కమెడియన్లు రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. వరుణ్ తేజ్,
నాగబాబు, వైష్ణవ్ తేజ్ పిఠాపురంలో పర్యటించారు. ఇక విదేశాల్లో షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న
మెగాస్టార్.. ఈ నెల 9న పిఠాపురంలో పవన్ నిర్వహించే ప్రచారంలో పాల్గొననున్నారు.