AP: ఎన్టీఆర్ వైద్య సేవలపై సాక్షిపత్రిక తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. సాక్షి యాజమాన్యం ఇకనైనా తప్పుడు, అబద్ధపు ప్రచారాలను ఆపాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా సాక్షి దినపత్రికలో ఎన్టీఆర్ వైద్య సేవలపై వచ్చిన అసత్యపు వార్తా కథనాలపై మంత్రి ఆగ్రహించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆదివారం నాడు మంత్రి సత్యకుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యంపై విరుచుకుపడ్డారు.