ముద్రగడ కూతురు క్రాంతి తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకున్నా.. ఆలోచన విధానం మాత్రం మారలేదని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ను ప్రశ్నించని ఆయనకు.. పవన్ను ప్రశ్నించే అర్హత లేదని నిలదీశారు. పవన్కు సమాజానికి ఏం చేయాలో స్పష్టత ఉందని, తన తండ్రికి అది లేదనిపిస్తోందని చెప్పారు. రాజకీయాలను వదిలేసి ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు.