మొక్కలను కన్నబిడ్డల్లా సంరక్షిస్తే భవిష్యత్తులో అవి మనల్ని రక్షిస్తాయని యువజన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఈరన్న, రామకృష్ణ అన్నారు. సోమవారం ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో ఖాళీ స్థలాల్లో 500 మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కల పెంపకాన్ని విరివిగా చేపట్టాలన్నారు. మొక్కల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదన్నారు.